నవతెలంగాణ – హైదరాబాద్
భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ ఫ్యాన్స్ను అలరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు ఈమధ్యే వీడ్కోలు పలికిన అతను కరీబియన్ లీగ్లో దంచి కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అవును.. ఈ 37 ఏళ్ల కుడి చేతివాటం బ్యాటర్ తాజాగా సెయింట్ కిట్స్, నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాంతో, ఈ లీగ్లో ఆడుతున్న రెండో భారత క్రికెటర్గా రాయుడు రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ప్రవీణ్ తాంబే ఈ లీగ్లో ఆడాడు. ఐపీఎల్ పదహారో సీజన్లో రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడాడు. అయితే.. ఫైనల్ మ్యాచ్కు ముందే అతను ఐపీఎల్కు రిటైర్మెంట్ పలుకుతున్నానని చెప్పాడు. దాంతో, రాయుడుకు ఘనమైన వీడ్కోలు పలకాలని సీఎస్కేయాజమాన్యం అనుకుంది. అనుకున్నట్టుగానే ట్రోఫీ సాధించి ఈ స్టార్ ఆటగాడికి గొప్ప బహుమతి ఇచ్చింది. దాంతో, ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన క్రికెటర్గా రాయుడు తన కెరీర్ ముగించాడు.