పడకల్ గ్రామంలో అమ్మ ఆదర్శ కమిటీ సమావేశం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కన్వీనర్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. పాఠశాలలో చదివే విద్యార్థులకు త్రాగునీటి సదుపాయము విద్యుత్ సదుపాయము మరుగుదొడ్డి సదుపాయము కల్పించాలని సూచించారు. విద్యార్థులకు ప్రాథమిక అవసరాలు తీర్చినట్లైతే వారు ఆరోగ్యంగా ఉండి మంచి చదువులు చదివి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు వివో ఏ సుమతి తదితరులు పాల్గొన్నారు.
Spread the love