నేటి నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థులకు అలర్ట్. ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు ఇవాల్టి నుంచి కౌన్సెలింగ్ జరగనుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం శని, ఆదివారాల్లో ఆన్​లైన్​లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ఈ నెల 4, 5వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఈ నెల 4 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. 11న సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించింది. బైపీసీ అభ్యర్థులకు అయిదు కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 8 వేల 312 సీట్లు అందుబాటులో ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 114 కాలేజీల్లో 6 వేల 910 బీఫార్మసీ సీట్లు.. 61 కళాశాలల్లో 1191 ఫార్మ్ డీ సీట్లు.. మూడు కాలేజీల్లో 94 బయో టెక్నాలజీ.. రెండు కాలేజీల్లో 36 బయోమెడికల్ ఇంజినీరింగ్, రెండు కాలేజీల్లో 81 ఫార్మాస్యూటికల్ సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. .

Spread the love