గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి…

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి తండా వద్ద సోమవారం సాయంత్రం ఒక గూర్తు తెలియని వాహనం ఢీ కోని నడిపల్లి తండాకు చెందిన బట్టు పంగు బాయి 70 అక్కడి కక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ కచ్చాకాయల గణేష్ తెలిపారు.వివరాలు‌ ఉన్నాయి. నడిపల్లి తాండా జాతీయ రహదారి 44 వద్ద రోడ్డు దాటుతుండగా అదే సమయంలో డిచ్ పల్లి వైపు నుండి ఆర్మూర్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం పంగుబాయిని ఢీకొనడంతో పంగుబాయి అక్కడి కక్కడే మృతి చెందారని, మృతురాలి మనవడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

Spread the love