నిరుపేదలకు అండ.. బుసిరెడ్డి ఫౌండేషన్

నవతెలంగాణ – పెదవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండల కేంద్రంలోని రంగప్ప కాలనీకీ చెందిన ఆవుల చెన్నకేశవులుకు గత కొద్ది రోజులక్రితం బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలుసుకుని శుక్రవారం బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నిరుపేదలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని, వారికి సహాయ సహకారాలు ఎల్లప్పుడు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,  మాజీ యంపీపీ, తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, సతీష్, సురేష్, ఇస్రం లింగస్వామి, గజ్జల శివానంద రెడ్డి,వంగాల భాస్కర్ రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, రామకృష్ణారెడ్డి, పెద్దవూర యూత్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love