ఆందోల్ మైసమ్మ హుండీ ఆదాయం రూ.14 లక్షలు: ఈవో

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కే.మహేందర్ కుమార్ పర్యవేక్షణలో 134 రోజులకు హుండీ లెక్కింపులో రూ.14,00,607 రూపాయల నగదు సమకూర్చినట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చక సిబ్బంది,శ్రీ దుర్గా శివశక్తి సాయి సేవా సమితి సభ్యులు స్థానిక బ్యాంక్ క్యాషియర్ జి.నరేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love