మృతుని కుటుంభ సభ్యులకు అన్నదానం

నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండలం పర్వేదుల గ్రామపంచాయతీలో గల సుద్దబాయి తండాలో ఈ నెల 14 తేదీ కేసీఆర్ మీటింగ్ వెళ్లి యాక్సిడెంట్ లో దుర్మరణం చెందిన రమవత్ బాలు ( 24  ) అంత్యక్రియాలకు వచ్చిన బంధు మిత్రులకు పులిచెర్ల ఆడబిడ్డ భారతీయ జనతా పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంకణాల నివేదితరెడ్డి దాదాపు 150 మందికి తన ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అసెంబ్లీ కన్వీనర్ పాల్తి శంకర్ నాయక్,  పెద్దవూర మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు రమవత్ దేవ్సింగ్ నాయక్, పర్వేదుల ఉప సర్పంచ్ రమవత్ బాబు నాయక్, కొర్ర పులు నాయక్, బంధువులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love