అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

నవతెలంగాణ – హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఆదివారం అట్లాంటా రాష్ట్రంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో అక్కడిక్కకడే ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Spread the love