రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. అఖిలపక్ష భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో సీఎం భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అయితే రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించాలని కాంగ్రెస్ సర్కారు డిసైడ్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయా పార్టీల ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచి రాష్ట్ర చిహ్నాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఈ మీటింగ్ కు హాజరవుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

Spread the love