నవతెలంగాణ – ఢిల్లీ : వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే జయంత్ సింగ్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ప్రతిపక్ష కూటమితో తెగదెంపులు చేసుకోనున్నట్లు సంకేతాలు ఇవ్వగా.. తాజాగా ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన కూడా ఆ పార్టీ కూటమికి దూరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై కాంగ్రెస్, ఆప్ నడుమ పీఠ ముడి వీడకపోవడంతో.. తాము రాష్ట్రంలోని మొత్తం 14 స్థానాల్లో బరిలో దిగుతామని కేజ్రివాల్ ప్రకటించారు. ఇదే విషయాన్ని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా చెప్పారు.