ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక ఈ సమావేశాలు 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. ఈనెల 24న ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత.. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది

Spread the love