నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

నవతెలంగాణ – అమరావతి: ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి వారం రోజులపాటు అంటే ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు మొదట బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 9 గంటలకే ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలాంటి అంశాలపై చర్చించాలి. అనే దాని పైన ఈ బీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు అంశం ఈ అసెంబ్లీ సమావేశాలలో తెరపైకి రానుంది. దీనిపై వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ జరిగే ఛాన్స్ ఉంది.

Spread the love