మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా ఇంచార్జ్ గా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట గ్రామానికి చెందిన మంకిడి స్వామిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మంకిడి స్వామి మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా ఇంచార్జ్ గా బాధ్యత అప్పజెప్పిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై నమ్మకముతో ఈ బాధ్యతలు అప్పగించిన బిజెపి పార్టకి జరగబోయే మెదక్ పార్లమెంటు ఎన్నికలలో బిజెపి జెండా ఎగురవేసే విధంగా మెదక్ పార్లమెంటు పరిధిలోని దళిత ప్రజలను ఏకం చేసి మెదక్ పార్లమెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగిరే విధంగా నా వంతు కృషి చేస్తానని పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.