మంతూర్ నూతన బూత్ కమిటీల ఎన్నిక

నవతెలంగాణ-రాయపోల్
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి మాధవ నేనే రఘునందన్ రావు గెలుపే లక్ష్యంగా పార్టీ బలోపేతం కోసం నూతన బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని బిజెపి మండల అధ్యక్షులు రాజాగారి రాజా గౌడ్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో నూతన బూత్ కమిటీలు నియమించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ప్రతి బూత్ కమిటీలో మెజార్టీ సాధిస్తే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజార్టీతో గెలిపించడం సాధ్యమవుతుందని, బూత్ స్థాయి నుంచే పార్టీని, కార్యకర్తలను సంసిద్ధం చేయడం కోసం బూత్ కమిటీలను పునర్నిర్మానం చేపట్టడం జరుగుతుందన్నారు.మంతూర్ బూత్ అధ్యక్షులుగా పడిగే స్వామి, కర్ల రజినీకాంత్ రెడ్డిలను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నీల స్వామి, సీనియర్ నాయకులు కుమ్మరి కనుకయ్య,బెస్త రాములు, బాల్ రెడ్డి, ఎల్లయ్య, పాల శ్రీను, దండు చంద్రం, దూలం స్వామి, సమరేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పడిగే సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love