నర్సరీ ప్లాంట్ లను పరిశీలించిన ఎంపీడీవో

నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలోని వెంగళపూర్, బయ్యక్కపేట్, నార్లాపూర్, మేడారం గ్రామపంచాయతీ ల పరిధిలోని గల హరితహార నర్సరీలను మంగళవారం ఎంపీడీవో సుమన వాణి సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం మొక్కలు హరితహారం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు ఉండాలని పంచాయతీ కార్యదర్శినిలకు సూచించారు. నర్సరీలో మొక్కల సంరక్షణ సక్రమంగా నిర్వహించాలని, నర్సరీలో పెరుగుతున్న పిచ్చి మొక్కలన్నిటిని తొలగించి మొక్కల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. మొక్కలను సంరక్షించితే అవి మనల్ని రక్షిస్తాయని తెలిపారు. మొక్కలను పెంచడం వలన అవి చెడువాయువును ఆకర్షించి స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తాయని తెలిపారు. అందువలన ప్రతి ఒక్కరు మొక్కలు నాటే విధంగా చూడాలని సూచించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love