కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

– కావలసిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశం
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచే అనిశెట్టి దూప్పలపల్లి గోదాంలో ఈవీఎంల రిసెప్షన్ కేంద్రంలో   ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. సోమవారం ఆమె  అనిశెట్టి దుప్పలపల్లిలోని పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల ఆవరణ మొత్తం పూర్తిస్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, పోలీస్ సెక్యూరిటీ కి అవసరమైన వసతి షామియానాలు ఏర్పాటు చేయాలని, వర్షం వచ్చిన ఇబ్బంది కాకుండా అవసరమైనన్ని టార్పాలిన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీఎంలను స్వీకరించే సందర్భంలో సిబ్బందికి, సెక్టోరల్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పారు. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భద్రపరిచే ఈవీఎంల స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఎన్నికల పరిశీలకులు వసతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మోతిలాల్, నల్లగొండ తాసిల్దార్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న తదితరులు ఉన్నారు.
Spread the love