బీజేపీని ఓడించండి…భారత రాజ్యాంగాన్ని కాపాడండి: తమ్మినేని

– భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నిరంతరం పేదల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి..
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపు
నవతెలంగాణ – భువనగిరి
భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిగా భువనగిరి నియోజకవర్గవర్గం నుండి  పోటీ చేస్తున్న జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.  మంగళవారం భువనగిరి పట్టణంలో ఏఆర్ గార్డెన్ లో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడారు. దేశం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మార్చి ఆ స్థానంలో మనుధర్మాన్ని తిసోకోచ్చి ఫ్యూడల్ పద్ధతులు ప్రవేశ పెట్టడం కోసం కృషి చేస్తుందని అన్నారు. దీని ద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలు సృష్టిస్తుందన్నారు. దీనికి అడ్డుగా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చడమే ద్యేయంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటికే సిఏఏ,పౌరసత్వ రద్దు, జ్యోతిష్య శాస్త్రఅమలు, విద్యా కాషాయికరణ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను భేదించడం, లొంగదీసుకోవడం, మేధావులను జైల్లల్లో పెట్టడం లాంటి వాటిని బలవంతంగా అమలు చేస్తుందన్నారు. బీజేపీ గత ఎన్నికల ముందు రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పిందన్నారు. నల్ల డబ్బును బయటికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో ప్రతి ఒక్కరికి 15లక్షలు జమ చేస్తామని చెప్పిందన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి చట్టబద్ధత కలిగించిందన్నారు. ఎలెక్ట్రోల్ బాండ్స్ రూపంల్ 1600 కోట్ల రూపాయల్లో  800 కోట్ల రూపాయలు బీజేపీకి చేరాయన్నారు. ఈ ఎలెక్ట్రోల్ బాండ్స్ చట్ట విరుద్ధమైనవని సిపిఎం పోరాడిందన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్ల అవినీతి బయటికి వచ్చిందన్నారు  విద్యా రంగానికి కేవలం,4% మాత్రమే నిధులు కేటాయించారని విద్యను పూర్తిగా ప్రయివేటికరణ చేశారన్నారు. ఆకలి శుచిలో మనదేశం 111 స్థానంలో ఉందన్నారు లిక్కర్ కేసులో బీజేపీకి ఆరవిండో పార్మా కంపెనీ అధినేత శరత్ చంద్రారెడ్డి  ద్వారా 60 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయన్నారు. నాడు వ్యాపారస్తులు వేరు రాజకీయ నాయకులు వేరుగా ఉండేవారని అన్నారు.  నేడు వ్యాపారస్థులే రాజకీయ నాయకులుగా మారారన్నారు. వేల కోట్ల రూపాయలు అధిపతులు పోటీ చేస్తున్నారని వారు ఇంకా ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారన్నారు.   అందుకే నిరంతరం నిజాయితీగా నికరంగా ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జహంగీర్ ను ఈ ఎన్నికల్లో నిలబెట్టామని ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్,వీరయ్య,జూలకంటి రంగారెడ్డి లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ సీపీఐ(ఎం)  చేసిన పోరాటాలు తెలుసన్నారు సిపిఎం పోరాటాల ఫలితంగా పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు సాధించిపెట్టారన్నారు. నేడు ప్రజలు అనుభవిస్తురన్నారు నకిరేకల్, ఇబ్రహీంపట్నం, జనగామ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచి ప్రజల కోసం పనిచేసారన్నారు. భువనగిరి పార్లమెంట్ ఏర్పడిన 2009 ఎన్నికల నుండి సీపీఐ(ఎం) పోటీ చేస్తుందన్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో సీపీఐ(ఎం)  అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్ ను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
    ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ, సీపీఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి. జహంగీర్, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శులు కాడిగళ్ల భాస్కర్, మల్లు నాగార్జున రెడ్డి, మోకు కనకరెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, ఫైళ్ల ఆశయ్య, ఎంవి రమణ, డబ్బికార్ మల్లేశం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దొనూరి నర్సిరెడ్డి  పాల్గొన్నారు.
Spread the love