జేఈఈ మెయిన్ లో మెరిసిన ఆర్మూర్ విద్యార్థి

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణం లోని రామ్ నగర్ కాలనీ కి చెందిన ఇల్లెందుల ఆర్యన్ జేఈఈ మెయిన్స్ లో 99.275 పర్సంటైల్ సాధించాడు. ఈ విద్యార్థి హైదరాబాదులోని నారాయణ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడు. వీళ్ళ తల్లిదండ్రులు ఇల్లందుల నరేష్ గోల్డ్ స్మిత్ కాగా ,తల్లి గీత మగ్గిడి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది.. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత పి ఈ టి మధు ఉపాధ్యాయ బృందం విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆర్యన్ మాట్లాడుతూ తన లక్ష్యం ఐఐటి లో సీటు సంపాదించడం అని తెలిపాడు.

Spread the love