హైదరాబాద్ లో దారుణం.. మర్మాంగం కోసి హత్య

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో అర్ధరాత్రి దారుణం జరిగింది. బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షెహీన్నగర్లో రౌడీషీటర్ ముబారక్ సిగార్ (32)పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కత్తులతో పొడిచి, మర్మాంగం కోసేశారు. బండరాళ్లతో కొట్టి కిరాతకంగా చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love