ప్లాట్ ఫాంపై కూర్చున్న కేంద్ర మాజీ మంత్రి..

నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఫ్యామిలీతో రైల్వే ప్లాట్ ఫాంపై కూర్చొని రైలు కోసం ఎదురుచూస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న ఆయన సోమవారం తన సతీమణి సునీలా గజపతిరాజు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు వెళ్లేందుకు మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ప్లాట్ ఫారంపై ఎదురుచుస్తూ కనిపించారు. కేంద్ర మాజీ మంత్రి సాధారణ ప్రయాణికుడిలా రైలులో ప్రయాణించేందుకు ఇలా ప్లాట్ ఫాంపై కూర్చొని ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Spread the love