– నిందితుడు రాంరెడ్డిని కఠినంగా శిక్షించాలి: కేవీపీఎస్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అగ్రకుల అహంకారంతో దళితుడిని కట్టేసి కొట్టిన రాంరెడ్డిని కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ, టి స్కైలాబ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సెట్పెల్లి గ్రామానికి చెందిన దళిత రైతు దుర్గం బాపు పశువులు సూరం రామిరెడ్డి పొలంలో పడ్డాయనే కారణంతో బాపును నానా బూతులు తిడుతూ ఇంట్లో నుంచి ఇడ్చుకుంటూ. కొట్టుకుంటూ తీసుకొచ్చి చెట్టుకు కట్టేసికొట్టిన చర్య అత్యంత దుర్మారమైందని తెలిపారు. తక్షణమే రాంరెడ్డిపై ఎస్సీి, ఎస్టీ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరారు. ఆయన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు