గ్రామాలలో ఐహెచ్ఎల్ నిర్మాణాల ఆవగాహన

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలో ఎంపిడివో  నరేష్, ఎంపిడివో యాదగిరి నిర్మాణాలు చేసిన మరుగుదొడ్ల పైన అవగాహన కార్యక్రమం ఇంటింటికి తిరిగి నిర్వహించారు. అదేవిధంగా జుక్కల్ మండల కేంద్రంలో ఎంపిడివో నరేష్ పంచాయతి కార్యదర్శులు నిర్వహిస్తున్న ఉచిత రెండు వందల యూనిట్ల దరఖాస్తు ఫారాల స్వీకరణ ను క్షేత్ర స్థాయిలో పరీశీలించారు. ఎంపివో యాదగిరి ఖండేభల్లూర్, కేమ్రాజ్ కల్లాలి జీపిలలో జీపి సెక్రట్రిలతో కలిసి మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్దిదారుల వద్దకు వెళ్లి నిర్మించుకున్న మరుగుదొడ్లను ఖచ్చితంగా వాడుకలోకి  తీసుకోరావాలని, భహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాగని సూచించారు. అధేవిధంగా ఉచిత రెండు వందల యూనిట్ల దరఖాస్తులను  నమేాదు పక్రియను  పరీశీలించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల జీపి కార్యదర్శులప ఖండేబల్లూర్ శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గోన్నారు.

Spread the love