- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి నిర్వహించాల్సిన విధానంపై గ్రామస్తులకు సర్పంచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి వద్దే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి అందజేయడం వల్ల గ్రామ పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాబు, వార్డు సభ్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -



