అంతారంలో బడిబాట కార్యక్రమం ప్రారంభం

నవతెలంగాణ-మునిపల్లి
మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ అంతారం పాఠశాలలో శనివారం సర్పంచ్‌ ఎడ్ల శంకర్‌ ఆధ్వర్యంలో ప్రొఫె సర్‌ జయశంకర్‌ బడిబాట కార్యకమం ప్రారంభమైంది. ఈ కార్యక్ర మంలో భాగంగా మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని, చేర్పించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఉపాధ్యాయ బృందం వారికి వివరిచారు. ఈ కార్యక్రమంలో జెడ్‌ పిహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు సయ్యద్‌ సాబేర్‌ అలీ, ప్రైమరీ స్కూల్‌ ప్రధానో పాధ్యాయులు బాల్‌ రాజు, ఉపాధ్యాయ బృందం, సిఆర్‌పీ విఠల్‌ పాల్గొన్నారు.

Spread the love