వారణాసి, కాశీలో తెలుగు అవధానంలో పాల్గొన్న బండ కాడి అంజయ్య గౌడ్

నవతెలంగాణ-తొగుట : వారణాసి, కాశీలో తెలుగు అవధానంలో పాల్గొ న్నామని సహజ కవి బండ కాడి అంజయ్య గౌడ్ తెలిపారు. సోమవారం మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన బండ కాడి బాగమ్మ నర్సా గౌడ్ ప్రథమ సంతానం అంజయ్య గౌడ్. 22వ తేదీ శుక్రవారం రోజున అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ)లో భక్తిసాధనం ఆధ్వర్యంలో యుగళాష్ట వధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవధానంలో శ్రీ సంగనభట్ల నర్సయ్య అధ్యక్షత
అవధానం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్య క్రమంలో శతావధాన మరాళ ఆముదాల మురళి తో కలిసి అవధానం కార్యక్రమంలో పాల్గొన్నామని అన్నారు. పృచ్ఛకవర్యులు శాస్త్రుల రఘపతిశర్మ, కంది శంకరయ్య, మరుమాముల దత్తాత్రేయ శర్మ,  చిగురాల పద్మ, శిఖాగణేశు, మల్లంపల్లి శిరిష తది తరులు పాల్గొన్నారు. అవధానం నిర్వహించిన పండరి వారు మాట్లాడుతూ ఇంతవరకు కాశీలో తెలుగు అవధానం జరుగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Spread the love