ఎర్రబెల్లి దయన్నను వీడే ప్రసక్తే లేదు

నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీ, ప్రజా నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావును వీడి మరో పార్టీలకు వెళ్లే ప్రసక్తే లేదు అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చివరివరకు బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అభివృద్ధి అంటేనే ఎర్రబెల్లి.. ఎర్రబెల్లి అంటేనే అభివృద్ధి అనేది నగ్నసత్యమన్నారు. చరిత్రహీనులైన కొందరు మా ఇద్దరిని పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అబద్ధనే ఆయుధంగా.. మోసాన్నే అలవాటుగా చేసుకొని రాజకీయం చేస్తున్న నాయకులకు రాజకీయ సన్యాసం తప్పదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వెన్నుపోటు వ్యవహారాలు మానుకోవాలని హితబోధ చేశారు. చివరి వరకు దయన్న వెంటే ఉండి ప్రజాసేవ చేస్తామని తెలిపారు.
Spread the love