పరిస్థితి విషమించి వృద్ధురాలు మృతి

– అనారోగ్యంతో పురుగుల మందు తాగి అత్మహత్యయత్నం
నవతెలంగాణ – బెజ్జంకి
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇట్టిరెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఇట్టిరెడ్డి కాంతవ్వ(85) తన కుమారుడు,కోడలుతో కలిసి జీవనం సాగిస్తోంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మేరుగైన చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి కుమరుడు బాల్ రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.
Spread the love