- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడు బండి భగీరథపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ మండల్ సర్పంచ్ సావిత్రి సాయ్ గౌడ్ నిరసన కార్యక్రమంలో నాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో మంత్రుల కుమారులే దారి తప్పినప్పుడు అడ్డు అదుపు లేకుండా నియంత్రణ కోల్పోయి మైనర్ బాలికపై లైంగిక దాడి చేయడం సమంజసమేనా అని విమర్శించారు. పేదవారికి ఒక న్యాయం ఉన్నవారికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ నిరసనలో జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సెట్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -



