బేగంపేట రోడ్డు బురదమయం..

– ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు..
– గత 6 నెలలుగా నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు..
– త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారుల విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రం నుండి బేగంపేట వెళ్లే ప్రధాన రోడ్డు శుక్రవారం కురిసిన వర్షానికి గూడెం కల్వర్టు వద్ద నీరు నిలిచి పూర్తిగా బురదమయమైంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఆరునెలలుగా సంబంధిత గుత్తేదారు రోడ్డు నిర్మాణ పనుల్లో అలసత్వం వహించడం వల్లే అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయని.. ప్రభుత్వం మారిన రోడ్డు దుస్థితి మారడం లేదని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తున్న సంబంధిత గుత్తేదారుపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి అర్థాంతరంగా నిలిచిన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు.
Spread the love