నవతెలంగాణ- హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి డ్యాన్స్తో ఆకట్టుకున్నారు. గతంలో కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ నటులతో కలిసి స్టేజ్పై కాలుకదిపిన దీదీ.. ఇప్పుడు గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. మంగళవారం ఉదయం మమతా బెనర్జీ జల్పాయిగురి ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులతో సమావేశమయ్యారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. అదేవిధంగా అక్కడ డ్రమ్ వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.