పరిసరాల పరిశుభ్రతతోనే మెరుగైన ఆరోగ్యం..

నవతెలంగాణ- రాయపోల్
గ్రామాలలో పరిసరాల పరిశుభ్రతతోనే మానవులందరూ మెరుగైన ఆరోగ్యంతో జీవిస్తారని బీఆరఎస్ అన్నారు. సోమవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ 154వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, గాంధీ పాటించిన నియమాలను పాటిస్తూ పరిసరాల పరిశుభ్రతతోనే గ్రామాలలో శుభ్రంగా ఉంటాయని  గ్రామంలో గ్రామస్తులతో కలిసి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు  రోడ్డు పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగింపు మరియు  రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి ప్లాస్టిక్ కాగితాలు, రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్తను ఏరివేసి ఒక గంట శ్రమదానం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి రాధ, ఫీల్డ్ అసిస్టెంట్ బండ్ల స్వామి,లక్ష్మణ్, రమేష్, స్వామి, రాజు, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love