వృక్ష శాస్త్ర విభాగానికి చెందిన  భార్గవికికి డాక్టరేట్ ప్రధానం

నవతెలంగాణ –  డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో  రాసకట్ల భార్గవి కి సోమవారం జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్  ప్రదానం చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ పర్యవేక్షణలో భార్గవి “స్టడీస్ ఆన్ ఏ లేక్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ విత్ రిఫరెన్స్ టు సీజనల్ వేరియేషన్ ఆఫ్ ఫైటో ప్లాంక్ టాన్ కమ్యూనిటీ” అనే అంశం పై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ యూనివర్సిటీ కు సమర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ కి చెందిన బాటనీ విభాగం ప్రొఫెసర్ కే శైలజ ఎక్స్టెర్నల్ ఎగ్జామినర్ గా వ్యవహరించారు. కాగా భార్గవి తన పరిశోధనలో నిజామాబాద్ జిల్లాలోని రామడుగు ప్రాజెక్ట్ లో పెరుగుతున్న శైవలాలపై తన పరిశోధనలు కొనసాగించారు. పరిశోధనలో వివిధ రకాలైన శైవలాలు మానవ అభివృద్ధికి దోహదపడతాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భార్గవి  పరిశోధన ఫలితాలపై సంతృప్తి చెంది తెలంగాణ యూనివర్సిటీ అధికారులు డాక్టరేట్ అవార్డును ప్రకటించారు. తెయు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి భార్గవికి డాక్టరేట్  పొందినందుకు అభినందించారు.   ఈ కార్యక్రమంలో బివోఎస్ ప్రొఫెసర్ విద్యావర్ధిని  డాక్టర్. ఎం ఎ. హలీమ్ ఖాన్, డాక్టర్. దేవరాజు శ్రీనివాస్, డాక్టర్. వి. జలంధర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love