రేణుకా చౌదరి ని కలిసిన ఇమ్మడి గోపి ముదిరాజ్

నవతెలంగాణ – డిచ్ పల్లి

రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన మాజీ మంత్రి రేణుకా చౌదరి ని గురువారం దర్పల్లి మాజీ ఎంపీపీ, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర సలహాదారులు మోహమ్మద్ షబ్బీర్ అలీ తో కలిసి మర్యాద పూర్వకంగా కలిసి పులబోకే శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేతలు రేణుకా చౌదరి ని రాజ్యసభ ఎంపీ గా ప్రకటించాడం అబినందనమని, నామినేషన్ల చివరి రోజు నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రేణుకా చౌదరి ని కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపినట్లు ఇమ్మడి గోపి ముదిరాజ్ వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్వర్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ ఎంపి భారీ మెజార్టీ తో విజయం సాధించడం ఖాయమని దీమ వ్యక్తం చేశారు.
Spread the love