కార్మికులతోనే గ్రామ పరిశుభ్రత

– పంచాయతీ కార్మికులకు సన్మానం: ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ పంచాయతీ కార్మికుల తోనే గ్రామంలోని అన్ని విధులు పరిశుభ్రంగా ఉండాయాని, వారందరినీ సన్మానించడం అబినందనమని ఎంపిఓ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో 7నుంచి 14  వరకు నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని దానిలో భాగంగానే  నడిపల్లి పంచాయతీలో గ్రామసభ నిర్వహించి పంచాయతీ కార్మికులు జనార్దన్, శ్యాంసన్, నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి నిట్టు కిషన్ రావు, సిబ్బంది సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు.
Spread the love