దివ్యాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని మారుతీ నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ దివ్యాంగుల పాఠశాలలో పుట్టినరోజు వేడుకలను లిఖిత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు హాజరై మాట్లాడుతూ తనకు దివ్యాంగులు అంటే ప్రత్యేక అభిమానమని అన్నారు. తమ కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమం ఉన్న స్నేహ సొసైటీలోని దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈరోజు తన మనవరాలు లిఖిత పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. లిఖిత ఫుడ్ అండ్ న్యూ క్రియేషన్ లో విద్యను అభ్యసించి అమెరికాలో ఉద్యోగం చేస్తుందని తెలిపారు. లిఖిత మంచి స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రధాన కార్యదర్శి యస్, సిద్దయ్య  ప్రిన్సిపాల్ యస్ జ్యోతి వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి,శంకర్,నీలంరెడ్డి, మంజిత్ రావ్, శేకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love