పేటలో ఘనంగా బట్టి పుట్టిన రోజు వేడుకలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు జన్మదిన వేడుకలను నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మూడు రోడ్ల ప్రధాన కూడలిలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శనివారం కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బర్త్ డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలం లో స్వయంగా  ఇంటింటికి తిరిగి నిత్యావసరాలు,పళ్ళు కూరగాయలు పంచి పెట్టారని అలాంటి నాయకుడిని మరువ కూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో ఆప్షన్ పాషా, జల్లిపల్లి దేవరాజు బోసి పాండురంగ  సత్యవరుపు బాలయ్య,దాసరి నాగేంద్ర రావు,రమాదేవి జుజ్జూరపు దుర్గారావు,కొప్పుల శ్రీను, తగరం రాజేష్ ,మహేష్, బషీర్ ,వెంకన్న బాబు, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Spread the love