బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు

నవతెలంగాణ- భిక్కనూర్: బిక్కనూర్ మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యూత్ ప్రతినిధి గంప శశాంక్ సమక్షంలో బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంప శశాంక్ మాట్లాడుతూ 30 రోజులపాటు యూత్ నాయకులు సైనికుల్లా పనిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని, మండల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, బీఆర్‌ఎస్‌ యూత్ మండల అధ్యక్షుడు బుర్రి రంజిత్ వర్మ, పార్టీ సీనియర్ నాయకుడు నాగన్నగారి మల్లారెడ్డి, గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు.

Spread the love