బీజేపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారు: మమతా బెనర్జీ

నవతెలంగాణ – హైదరాబాద్: బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అయితే దీనిని బీజేపీ ఖండించింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది. అయితే బీజేపీకి చెందిన ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని తృణమూల్ తెలిపింది. ఈ ప్రచారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది.

Spread the love