రెంజల్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన బోధన్ ఆర్డీవో రాజా గౌడ్..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ తాసిల్దార్ కార్యాలయాన్ని బోధన్ ఆర్ డి ఓ రాజా గౌడ్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. బోధన్ నుంచి బైంసా వరకు నిర్మిస్తున్న రోడ్డు విస్తీర్ణ పనులలో భాగంగా తమ భూములు కోల్పోయిన రైతుల తో మాట్లాడారు. ఈ జాతీయ రహదారి లో భూములు కోల్పోయిన 27 మంది రైతుల పట్టా పాస్ పుస్తకాలను రెవెన్యూ సిబ్బందితో విచారణ జరపడం జరిగిందన్నారు. జాతీయ రహదారుల చట్టం ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు ఆయన వెంట తహసిల్దార్ రామచందర్, జాతీయ రహదారుల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Spread the love