గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..

నవతెలంగాణ-  ధర్మారం 

మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఈ నెల1శనివారం రోజున మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇతని వయసు సుమారుగా 30 నుండి 35 సం” ఉంటుంది ఇతని ఒంటి పై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, మరియు నల్లని గీతలు ఫుల్ హాండ్స్ షర్ట్ కలదు. ఇట్టి మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి పెద్దపల్లి నందు భద్రపర్చడం జరిగింది.ఒకవేళ ఎవరైనా ఇట్టి వ్యక్తి ని గుర్తు పట్టి నట్లయితే ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని స్థానిక ఎస్సై టి సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎస్ ఐ ధర్మారం 8712656508సీఐ పెద్దపల్లి 8712656505ఎసీపీ పెద్దపల్లి 8712656504 ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన వివరించారు.
Spread the love