ఇసన్న పల్లి లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

 నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని ఇసన్న పల్లి సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని సీనియర్ నాయకులు కందూరి పెద్ద లింబాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అన్నారు. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పి ఓట్ల అడగాలని, మతాల మధ్య చిచ్చు పెడుతూ, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ఆరటపడుతుందని, ప్రజలు ఈ పార్టీలను నమ్మవని, వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలిచి, తెలంగాణ ప్రజల సేవలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు లింగాపురం శంకర్, సిద్ధం బైరయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love