- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు నట్ట భోజన్న ఎగురవేశారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జక్రాన్ పల్లి ఉప సర్పంచ్ నట భోజన ఆధ్వర్యంలో పార్టీ జెండాలు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల మాజీ రైతుబంధు అధ్యక్షులు డి.కొండ శ్రీనివాస్ మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



