నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సోమవారం భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ (హాస కొత్తూర్) చౌరస్తా వద్ద ఉన్న పార్టీ జెండా గద్దె వద్ద గ్రామ శాఖ అధ్యక్షులు కొంటి కంటి నరేందర్ బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాగా మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి, వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, కమ్మర్ పల్లి ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, కమ్మర్ పల్లి మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, మైనార్టీ మండల అధ్యక్షులు హైమద్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం రాజేశ్వర్, రేంజర్ల మహేందర్, తీగల హరీష్, కొత్తపల్లి రఘు, కటిక శ్రీను, తంబల రాకేష్, పత్రి శ్రావణ్, కోరి నరసయ్య, సుంకరి మురళి, తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



