కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ నాయకులు

నవతెలంగాణ- శంకరపట్నం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ది దారులకు రైతు బంధు, రైతు రుణమాఫీ చేయడాన్ని నిలిపివేయాలని రైతులకు వ్యతిరేకంగా ఈ.సి కి దరఖాస్తు చేసిన కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేఖ విధానాలకు నిరసనగా గురువారం శంకరపట్నం మండల కేంద్రంలొ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆకుపచ్చ కండువాలు వేసుకుని కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసి లు సింగల్ విండో చైర్మన్, డైరెక్టర్ లు గ్రామ శాఖ అధ్యక్షులు, వివిధ గ్రామాల ఉపసర్పంచ్ లు రైతు సమన్వయ సమితి సభ్యులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, మండల నాయకులు, వార్డు సభ్యులు, తజా మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love