– పాల్గొననున్న బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
సోమవారం బీఅర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండలంలో జరిగే నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ వీ.గంగాధర్ గౌడ్ పాల్గొంటారని బిఅర్ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షులు చిలువేరి గంగదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి
గ్రామంలోని గంగా పుత్ర ఫంక్షన్ హాల్ లో మండల, గ్రామ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొననున్నాట్లు అయన తెలిపారు.ఈ కార్యక్రమానికి బిఅర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.