నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘బీఆర్ఎస్ అంటే భారత ”రైతు” సమితి అని మరోసారి రుజువైంది. జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు. మా ప్రభుత్వ విధానమని మరోసారి తేలిపోయింది’ అంటూ మంత్రి కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. ‘కేంద్రం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది సీఎం కేసీఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం. రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకం. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ…ఒక్క తెలంగాణలోనే వ్యవసాయమంటే సంతోషం. యావత్ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిది’ అని కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.