ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష

– పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల
– రెండోదశకు పర్యావరణ అనుమతులకు నిరాకరణ
– సాగునీటికి అడుగడుగునా ఆటంకాలు : మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, ప్రగతి ప్రస్థానంపై కేంద్రప్రభుత్వం అంతులేని వివక్ష చూపుతున్నది. నదీ జలాల వినియోగం నుంచి మొదలుకుని ప్రాజెక్టుల నిర్మాణం దాకా అన్నింట్లోనూ అడ్డంకులే. కష్ణా జలాల్లో తెలంగాణ వాటా డిమాండ్‌ను తేల్చకుండా తాత్సారం చేస్తున్నది. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదు. కేంద్ర సహాయ నిరాకరణ, వివక్ష ఉన్నా తెలంగాణను ప్రగతి పథంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టాం. ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా, తెలంగాణ అభివద్ధి పట్ల మా నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరు. తెలంగాణ అభివద్ధిని అడ్డుకొనే శక్తులపై రాజీ లేకుండా పోరాడుతాం. తెలంగాణ అభివద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి’ అని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో కేటీఆర్‌ గురువారం బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకుని, తనదైనశైలిలో సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకుసా గుతున్నది. తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం, తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివద్ధిని అడ్డుకునే ప్రయత్నం గత తొమ్మిదేండ్లుగా కొనసాగిస్తూనే ఉన్నది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తున్నది. ఈ ప్రాజెక్టు రెండో దశకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకుపైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సష్టించడం శోచనీయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతో ప్రాజెక్టు పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుంది. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో తల్లడిల్లేవి. తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్‌నగర్‌ జిల్లా వలసలకు కేంద్రమైంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్‌ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్‌ రాక్షసభూతాన్ని మా ప్రభుత్వం తరిమికొట్టింది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాల పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదు. అందుకే అడ్డు తగులుతున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్‌ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సష్టిస్తున్నది. నిధులు ఇవ్వకుండా నిరాకరిస్తున్న కేంద్రం, తాజాగా పర్యావరణ అనుమతుల పేరుతో మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. పాలమూరుకు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎగువభద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హౌదాను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం మొండిచేయి చూపించడం తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం. ఒకవైపు కష్ణ జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నది. రాజ్యాంగబద్ధంగా నీటి వినియోగ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నా, ముందస్తు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తన సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి నెట్టేసింది. కష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకుండా, కనీసం ట్రిబ్యునల్‌కు పంపకుండా తొమ్మిదేండ్లుగా దాటవేత ధోరణిని అనుసరిస్తున్నది. బీజేపీ నేతత్వంలోని కేంద్రం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య పూరిత, వివక్షపూరిత వైఖరి దుర్మార్గం. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణ ప్రజలు తమ అవసరాల, అకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకుని, అభివద్ధి పథంలో నడిచేందుకు సైతం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యల మీద ఆధార పడేలాచేయాలనుకోవడం ముమ్మాటికి అవమానిం చడమే. ఇప్పటికే దాదాపు దశాబ్ద కాలంగా కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సష్టించినా, ఏ అంశంలోనూ సహకరించకపోయినా అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాల కన్నా ముందు వరుసలో నిలుపుతూ, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడంలో మేం విజయం సాధించాం. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకునే ఏలాంటి శక్తులనైనా రాజీ పడకుండా ఎదుర్కొంటాం. అయితే కేంద్ర ప్రభుత్వ పక్షపాత నిర్ణయాలు, వివక్షపూరిత వైఖరి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.

Spread the love