కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం

నవ తెలంగాణ -చిట్యాల టౌన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఆపాలని కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం చిట్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు,  రైతుబంధు, రైతు రుణమాఫీ ఒకవేళ రైతు అకాల మరణం చెందితే రైతు బీమా తో ఆ కుటుంబానికి   కెసిఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేశం, మర్ల రామిరెడ్డి, పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, గోధుమ గడ్డ జలంధర్ రెడ్డి, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, చిత్రగంటి ప్రవీణ్, దాసరి నరసింహ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love