లారీని ఢీకొట్టిన బస్సు.. నలుగురి దుర్మరణం..

నవతెలంగాణ – అమరావతి: పత్తిపాడు హైవేపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్లు మార్చడం కోసం హైవేపై పక్కన లారీని డ్రైవర్ ఆపేశాడు. ఇది గమనించక వేగంగా వెళ్లి వెనుక నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. ఘటనలో అక్కడిక్కడే నలుగురి మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love