నవతెలంగాణ – మెదక్: కారు అదుపు తప్పి డీవైడర్కు ఢీకొని రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా.. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తుండగా కారు డివైడర్ను ఢీకొని కాలువలో పడింది. కారులో ఉన్న ముగ్గురిలో, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి.. కాలువలో నుండి బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి గురైన వారిని జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.